లాక్ డౌన్ కారణంగా పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. మరో పక్క కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా భారత్ లో రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇక ఇప్పటికే సినిమా రంగం పై కరోనా పంజా విసిరింది. కరోనా ఎఫెక్ట్ తో థియేటర్స్ అన్ని మూసేశారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో సినిమా థియేటర్స్లో పనిచేసే కార్మికులు కష్టాల పాలు అయ్యారు.
తమకు పూర్తి వేతనాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన దీక్ష చేశారు. సినిమా థియేటర్ యజమానులు థియేటర్లో పనిచేసే కార్మికులకు మార్చి, ఏప్రిల్ నెల జీతాలు ఇవ్వకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారట. తమను ఇబ్బందులకు గురి చేస్తున్న యజమానుల పై కఠిన చర్యలు తీసుకొని సకాలంలో జీతాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు.