ఈగ ప్రచారం కోసం వైజాగ్ వెళ్ళిన రాజమౌళి

ఈగ ప్రచారం కోసం వైజాగ్ వెళ్ళిన రాజమౌళి

Published on Apr 9, 2012 9:51 PM IST

“ఈగ” చిత్ర ప్రచారం కోసం రాజమౌళి విశాఖపట్టణంలో జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్ కి ఈగ బృందంతో హాజరయ్యారు. మొదటి నుండి ఈగ చిత్ర బృందం ఈగ ప్రచారం ప్రత్యేకంగా చేస్తున్నారు.ఈ చిత్రం మీద జాతీయ మీడియా కన్ను పడ్డాక ఈ బృందం ఈరోజు విశాకపట్టణం లో జరుగుతున్న డెక్కన్ చార్జర్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ ని వీరి ప్రచారానికి వేదికగా మలుచుకున్నారు. ట్విట్టర్లో ఎందుకు ఈ చిత్రానికి ఇంత ప్రచారం చేస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు రాజమౌళి ఇలా సమాధానం ఇచ్చారు ” ఒక వైపు దమ్ము మరో వైపు గబ్బర్ సింగ్ ఇలాంటి చిత్రాల మధ్య మా చిన్ని “ఈగ” తట్టుకొని నిలబడాలంటే ఈ మాత్రం ప్రచారం చెయ్యాలి కదా” అని అన్నారు. ఇదే కాకుండా ఈ చిత్రం మీద ఉన్న భారీ అంచనాలు కూడా ఈ చిత్ర ప్రచారానికి ప్రధాన కారణం. నని,సమంత మరియు సుదీప్ లు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి తెలుగులో నిర్మించగా తమిళ వెర్షన్ (నాన్ ఈ ) చిత్రాన్ని ప్రసాద్ వి పోట్లురి నిర్మించారు.కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం ఈ వేసవికి విడుదల కానుంది.

తాజా వార్తలు