రామ్ చరణ్ తేజ్ మరియు తమన్నాలు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “రచ్చ”. ఈ చిత్రం మొదటి వారం వసూళ్ళలో రికార్డ్ సృష్టించింది నిర్మాతల ప్రకారం ఈ చిత్రం 26.92 కోట్లు వసూలు చేసింది. నైజాం ప్రాంతంలో మాత్రమే ఈ చిత్రం 7 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. ఇంకా ఈ చిత్ర పరుగు మరి కొద్ది రోజులు కొనసాగనుంది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రం రామ్ చరణ్ ని మరో మెట్టు ఎక్కించింది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్ర మళయాళ వెర్షన్ ఏప్రిల్ 13న విడుదల చెయ్యనున్నారు. నిర్మాతలు ప్రకటించిన వసూళ్ళు మీకోసం
ప్రాంతం వసూళ్లు
నైజాం | – | 7.5 కోట్లు |
సీడెడ్ | – | 5.4కోట్లు |
కృష్ణ | – | 1.61కోట్లు |
గుంటూరు | – | 2.88కోట్లు |
తూర్పు గోదావరి | – | 1.77కోట్లు |
పశ్చిమ గోదావరి | – | 1.65కోట్లు |
వైజాగ్ | – | 2.44కోట్లు |
నెల్లూరు | – | 1.17కోట్లు |
ఆంధ్రప్రదేశ్ మొత్తం | – | 24.42కోట్లు |
కర్నాటక | – | 2.5కోట్లు |
మొత్తం వసూళ్లు : | – | 26.92కోట్లు |