“దమ్ము” పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : కే ఎస్ రామారావు

“దమ్ము” పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : కే ఎస్ రామారావు

Published on Apr 10, 2012 8:21 PM IST

కే.ఎస్.రామారావు తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ నిర్మాతల్లో ఒకరు. క్రియేటివ్ కమ్మర్శియల్స్ బ్యానర్ మీద ఈయన చాలా విజయవంతమయిన చిత్రాలను నిర్మించారు. ఇదే బ్యానర్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీయార్ “దమ్ము” చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రం గురించి ఈ ప్రముఖ నిర్మాత ధీమా వ్యక్తం చేసారు ” దమ్ము చిత్రం చాలా బాగా వచ్చింది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాదిస్తుందన్న నమ్మకం నాకుంది. కుటుంభ సమేతంగా చూడగలిగిన చిత్రం ఇది. ఎన్టీయార్ అభిమానులతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.” అని అన్నారు.ప్రస్తుతం నిర్మాణేతర కార్యక్రమాలు చ్జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న భారీ విడుదల కానుంది. త్రిష మరియు కర్తీకలు కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.

తాజా వార్తలు