ఏ. ఆర్. రెహమాన్ మరియు గౌతం మీనన్ ల కలయిక లో వస్తున్న చిత్రం “ఏక్ దీవానా థా” ఆడియో విడుదలని తాజ్ మహాల్ దగ్గరలో ని అందమయిన ప్రాంతం లో చెయ్యాలి అని అనుకున్నారు. దీనికి పురావస్తు శాఖ వారు అనుమతిని నిరాకరించారు. గతం లో “మేరె బ్రదర్ కి దుల్హన్” చిత్ర నిర్మాణ సమయంలో ఈ ప్రదేశం పాక్షికంగా దెబ్బతినింది. అందువలన ఇంక ఎటువంటి సినిమా కార్యకలాపాలని ఈ ప్రదేశం లో అనుమతించము అని పురావస్తు శాఖ వారు పేర్కొన్నారు. ఈ చిత్ర ఆడియో విడుదలని ఆగ్రా లో ఒక హోటల్ లో నిర్వహిస్తున్నారు. “ఏక్ దీవానా థా” చిత్రం తెలుగు లో “ఏ మాయ చేసావే” చిత్రానికి రీమేక్. హిందీ లో ప్రతీక్ బబ్బర్ మరియు ఏమి జాక్సన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాబోయే సంవత్సరం జనవరి లో ఈ చిత్రం విడుదల కావచ్చని అనుకుంటున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?