టాప్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి విరామం తీసుకుని, రామ్ చరణ్తో తన తదుపరి సినిమాపై దృష్టి సారించారు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఇక రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాకు సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వామి కాగా, బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
అదనంగా, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై నాలుగు కొత్త సినిమాలు లైన్లో ఉన్నాయి. అలాగే ఆయన ప్రభాస్, విజయ్ దేవరకొండలతో కూడా కొత్త ప్రాజెక్ట్లను ప్లాన్ చేస్తున్నారు. ఇన్ని ప్రాజెక్టులతో సతమతమవుతున్న ఆయన, ఏ ప్రాజెక్టుకు కూడా ఎలాంటి అడ్డంకులు కలగకుండా జాగ్రత్త పడుతున్నారు.


