పాన్–ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ‘మిరాయ్’ సెప్టెంబర్ 12న గ్రాండ్గా రిలీజ్ కానుంది. సూపర్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో అలరిస్తుండగా, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. ఈ సందర్బంగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని సినీ విశేషాలు పంచుకున్నారు.
“‘మిరాయ్’ అనుకున్న దానికంటే అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఇది కేవలం సూపర్ హీరో మూవీ మాత్రమే కాదు, రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్. ప్రేక్షకులు తప్పకుండా ఈ కథకి కనెక్ట్ అవుతారు,” అని కార్తీక్ ఘట్టమనేని స్పష్టం చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ – “ఈ పాత్రకి సహజమైన దూకుడుతో పాటు ఒక పాజిటివ్ వైబ్ అవసరమైంది. అలాంటి సహజ అగ్రెషన్తో నటించే యాక్టర్గా మనోజ్ గారు పర్ఫెక్ట్గా సరిపోయారు. ఆయనకి ఉన్న మార్షల్ ఆర్ట్స్ అనుభవం యాక్షన్ సన్నివేశాలను మరింత రియలిస్టిక్గా తీర్చిదిద్దడానికి ఉపయోగపడింది,” అన్నారు.
శ్రీయా శరణ్ ఎంపిక
“తల్లి–కొడుకుల ఎమోషన్ ఈ సినిమాకి అసలైన హృదయం. ఈ పాత్రలో ఒకటే సమయంలో వల్నరబిలిటీ, స్ట్రెంత్ రెండూ ఉండాలి. అలాంటి ఎమోషనల్ బలాన్ని చేయగల వ్యక్తిగా శ్రీయా గారు మాకు గుర్తొచ్చారు. ఆమె అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో సినిమా ఆత్మను మరింత బలపరిచారు,” అని దర్శకుడు తెలిపారు.
ఇప్పటికీ ప్రమోషనల్ కంటెంట్కి వస్తున్న రెస్పాన్స్ చూస్తే ‘మిరాయ్’ మరో విజువల్ స్పెక్టకిల్ అవుతుందనడం అతిశయోక్తి కాదు. దర్శకుడు చెప్పినట్టే, రూటెడ్ ఎమోషన్తో కూడిన ఈ యాక్షన్ అడ్వెంచర్కి ఆడియన్స్ తప్పకుండా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.