మనోజ్ కి కరోనాతో మళ్ళీ గ్యాప్ !


మంచు మనోజ్‌ సినిమాలకు చాల గ్యాప్ ఇచ్చి ఎట్టకేలకు మళ్లీ ‘అహం బ్రహ్మాస్మి’తో మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ కాయబోతున్న సమయంలో కరోనా వచ్చి.. మళ్ళీ మనోజ్ కి గ్యాప్ వచ్చేలా చేసింది. కరోనా అనంతరం ‘అహం బ్రహ్మాస్మి’ రెగ్యూలర్ షూటింగ్ మొదలుకానుంది. మొదట ఫైట్ మాస్టర్ పీటర్ హేన్స్ కంపోజింగ్ లో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ చేయనున్నాడు.

ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసే మనోజ్.. ఈ సారి కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. ‘అహం బ్రహ్మాస్మి’ అనే గొప్ప స్లోగన్ ఆధారంగా నడిచే కథతో పవర్ ఫుల్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ‘ఎమ్ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో మంచు మనోజ్ సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు.

దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకం పై మంచు ఫ్యామిలీ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Exit mobile version