విదేశాలలో చిక్కుకున్న మంచు విష్ణు కుటుంబం ఇంటికి.

విదేశాలలో చిక్కుకున్న మంచు విష్ణు కుటుంబం ఇంటికి.

Published on Jun 11, 2020 2:41 PM IST

ఎట్టకేలకు మంచు విష్ణు భార్య పిల్లలు ఇల్లు చేరుకోనున్నారు. దాదాపు వాళ్ళు మూడు నెలలకు పైగా సింగపూర్ లో ఇరుక్కుపోయారు. బంధువులను కలవాడిని విదేశాలకు వెళ్లిన మంచు విష్ణు ఫ్యామిలీ లాక్ డౌన్ కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో పాటు, అన్ని ఫ్లైట్స్ రద్దయ్యాయి. దీనితో మంచు విష్ణు భార్య విరానికా రెడ్డి, పిల్లలు అరియానా మరియు వివియానా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

ఇన్ని రోజుల తరువాత లాక్ డౌన్ నిబంధలనలు సడలించడంతో పాటు, ప్రభుత్వాల సహకారంతో వీరు ఇంటికి చేరుకుంటున్నారు. దీనితో తమ సంతోషాన్ని తెలియజేస్తూ విరానికా రెడ్డి ట్విట్టర్ లో వారు ఇంటికి చేరుకోవడానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మెస్సేజ్ పోస్ట్ చేశారు. ఇక కొద్దిరోజుల క్రితం పిల్లల్ని బాగా మిస్సవుతున్నట్లు మంచు విష్ణు ఓ వీడియో సందేశం ద్వారా తెలియజేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు