ఖరారైన మనం విడుదలతేదీ

ఖరారైన మనం విడుదలతేదీ

Published on Jan 29, 2014 12:46 AM IST

manam
గతనెలలో స్వర్గస్థులైన అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా ‘మనం’. ఈ యేడాదిలోనే ఎదురుచూస్తున్న చిత్రంగా ఈ మూడు తరాల మల్టీ స్టారర్ నిలిచింది. విక్రమ్ కుమార్ దర్శకుడు. శ్రియ, సమంత హీరోయిన్స్. ఈ సినిమా మార్చ్ 31న మనముందుకు రావడానికి ముస్తాబవుతుంది

నాగేశ్వరరావుగారి మరణం తరువాత మొదటిసారిగా మాట్లాడినా నాగార్జున తన తండ్రి అంతే తనకు ఎంత ఇష్టమో, నాగేశ్వరరావుగారికి ఈ రంగంఅంటే ఎంత ఇష్టమో తెలిపారు. “మనం” షూటింగ్ పీరియడ్ లో వుండగా ఆయనకు క్యాన్సర్ అని తెలిపారని, చాలా వరకూ దాంతో పోరాడినట్లు, చివరికి తనపాత్రకు డబ్బింగ్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ తోనో చెప్పవలసివస్తుందేమో అని పరికరాలన్నీ తెప్పించుకుని ఇంట్లోనే స్వయంగా చెప్పిన విషయాలను నెమరువేసుకున్నారు

ఒక్క పాట మినహా ఏ.ఎన్ఆర్ షూటింగ్, డబ్బింగ్ లను ముగించుకున్నారు.”నాకు తండ్రి కంటే ఎక్కువైన ఆయనకు మనం సరైన రీతిలో సత్కారం అందిస్తుందని” తెలిపారు

తాజా వార్తలు