ప్రముఖ సినీ నిర్మాత ఎం.ఎస్ రెడ్డి, తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్ద నిన్న ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆయన అంత్యక్రియలు పంజాగుట్టలోని స్మశాన వాటికలో జరగనున్నాయి. నిన్న ఎం.ఎస్ రెడ్డి గారి నివాసంలో ఇండస్ట్రీ పెద్దలు మరియు పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అక్కినేని నాగేశ్వర రావు,సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, బీజేపి నేత వెంకయ్య నాయుడు,ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీ రావు, కృష్ణం రాజు, కే.రాఘవేంద్ర రావు, కైకాల సత్యనారాయణ మరియు జయసుధ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగు చలచిత్ర నిర్మాతల మండలి మరియు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక లెజెండ్ ని కోల్పోయామని ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
ఎం.ఎస్ రెడ్డి గారి అంత్యక్రియలు నేడే
ఎం.ఎస్ రెడ్డి గారి అంత్యక్రియలు నేడే
Published on Dec 12, 2011 9:52 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘వార్-2’లో హృతిక్ కంటే తారక్కే ఎక్కువ..?
- ‘ఓజి’ నుండి ఆ ట్రీట్ వచ్చేది అప్పుడేనా..?