సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్న లోకేష్ కనగరాజ్

సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్న లోకేష్ కనగరాజ్

Published on Apr 22, 2025 6:01 PM IST

తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘కూలీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్ ప్రేక్షకుల్లో ఈ మూవీపై సాలిడ్ అంచనాలు క్రియేట్ చేశాయి. అయితే, ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాజాగా తన అభిమానులకు ఓ షాకింగ్ విషయాన్ని తెలిపాడు. తాను సోషల్ మీడియా నుంచి కొంత బ్రేక్ తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నాడు. కూలీ ప్రమోషన్స్ వరకు తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు తెలిపాడు.

దీంతో లోకేష్ అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నారు. అయితే, కూలీ సినిమాతో ఆయన చేసే సౌండ్ మామూలుగా ఉండబోదని.. అందుకే ఆయన ఇప్పుడు సైలెంట్‌గా ఉంటున్నాడని వారు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కూలీ సినిమాలో ఉపేంద్ర, అక్కినేని నాగార్జున, శ్రుతి హాసన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. కూలీ చిత్రాన్ని ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు