ఓటీటీ : జూలై 4న రానున్న ‘ఉప్పు కప్పురంబు’ !

ఓటీటీ : జూలై 4న రానున్న ‘ఉప్పు కప్పురంబు’ !

Published on Jun 16, 2025 10:11 AM IST

ప్రైమ్ వీడియో, ఈరోజు తన రాబోయే తెలుగు ఒరిజినల్ మూవీ ‘ఉప్పు కప్పురంబు’ యొక్క ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మించిన ఈ చిత్రానికి అని. ఐ.వి. శశి దర్శకత్వం వహించగా వసంత్ మారింగంటి రచన చేశారు. కీర్తి సురేష్, సుహాస్, బాబు మోహన్, శత్రు, మరియు తాళ్లూరి రామేశ్వరి వంటి అద్భుతమైన తారాగణం నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషలలో డబ్‌లతో ప్రసారం చేయనున్నారు. చమత్కారం, హాస్యం తో నిండిన ఉప్పు కప్పురంబు ఒక సామాజిక సమస్యపై తేలికపాటి దృక్పథాన్ని చూపించబోతోంది.

కాగా జూలై 4న నుండి భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా 240 కి పైగా దేశాలు మరియు ప్రాంతాలలో ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా ప్రీమియర్ అవుతుంది. “ఉప్పు కప్పురంబు అనేది ఆలోచింపజేసే, ఆహ్లాదకరమైన మరియు విచిత్రమైన వ్యంగ్య చిత్రం అట, ఇది ప్రామాణికమైన గ్రామీణ వాతావరణం యొక్క నేటివిటీని తెలియజేస్తుంది. ఇక ‘ఉప్పు కప్పురంబు’ చిత్రాన్ని నేను చాలా కాలంగా తెరపైకి తీసుకురావాలని కోరుకుంటున్నాను” అని దర్శకుడు అని ఐ.వి. శశి తెలియజేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు