కన్నడ స్టార్ హీరో యాష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కెజిఎఫ్’ చిత్రం అన్ని భాషల్లోనూ భారీ విజయాన్ని సాదించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో రెండవ భాగం ‘కెజిఎఫ్ 2’పై అన్ని పరిశ్రమల్లో అమితాశక్తి నెలకొంది. ఈ అంచనాలను అందుకోవడానికి నిర్మాతలు ద్వితీయ భాగాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
అయితే 2 నెలల లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేదు. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తాజా అప్ డేట్ అభిమానులకు కొంత ఉత్సాహాన్నిచ్చింది. నిన్న రాత్రి, ఈ చిత్ర ఎగ్జిగ్యూటివ్ నిర్మాత కార్తీక్ గౌడ ట్విట్టర్లో.. దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు సంగీత స్వరకర్త రవి బస్రూర్ సంగీత సెషన్లలో బిజీగా ఉన్న ఫోటోను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ప్రస్తుతానికి టీమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.
కాగా సెకండ్ పార్టును ఇంకా హెవీ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంటుందట, వరల్డ్ మాఫియాను భారీ స్థాయిలో చూపిస్తున్నారట. ఇందులో ప్రధాన ప్రటినాయకుడి పాత్రలో సంజయ్ దత్ నటిస్తుండగా ఇంకొందరు ఇతర భాషల నటీ నటులు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.