మిలియన్స్ తో ‘కుబేర’ మ్యానియా!

మిలియన్స్ తో ‘కుబేర’ మ్యానియా!

Published on Jun 29, 2025 8:00 PM IST

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ లో కింగ్ నాగార్జున సాలిడ్ పాత్రలో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “కుబేర”. అయితే తెలుగు తమిళ్ లో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో ఎక్కువ వసూళ్లు సాధించి ధనుష్ కెరీర్లో మరో 100 కోట్ల సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమా మేనియా రెండో వారంలో కూడా గట్టిగా కొనసాగుతుండగా మిలియన్స్ మార్క్ లతో కుబేర కొనసాగుతుంది.

మరి బుకింగ్స్ లో ఇప్పుడు వరకు 1.5 మిలియన్ టికెట్స్ ని కుబేర సొంతం చేసుకుంటే యూఎస్ మార్కెట్ లో 2.2 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటి స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తుంది. మొత్తానికి ఇలా కుబేర మాత్రం నిలకడగా ప్రదర్శన కొనసాగిస్తే సాలిడ్ వీకెండ్ ని ముగించనుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో జిమ్ షర్బ్ నెగిటివ్ పాత్రలో కనిపించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు