రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. కీరవాణి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ నేపథ్య సంగీతం పై వర్క్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ చిత్రం యొక్క బిజియమ్ ను పూర్తి చేసినట్లు.. సినిమా మొత్తంలో కీలకమైన సన్నివేశాల్లో వచ్చే ఈ బిజియమ్ సినిమా హైలైట్స్ లోనే ఒకటిగా నిలుస్తోందట. కీరవాణి కెరీర్ లోనే ఈ సినిమా బెస్ట్ గా నిలుస్తోందట. అలాగే ఇప్పటివరకూ షూట్ చేసిన సీన్స్ ను ఎడిటర్ తమ్మిరాజు తన ఇంటిలోని ఎడిటింగ్ షూట్ లోనే ఎడిట్ చేస్తున్నారట. అవుట్ ఫుట్ విషయంలో రాజమౌళి పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాకు రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.
కాగా సినిమాలో డైలాగ్ లు చాలా బాగుంటాయని… మెయిన్ గా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా కొత్తగా ఉంటాయట. రాజమౌళి తన సినిమాల్లో విజువల్స్ ని తప్ప.. డైలాగ్ లను పెద్దగా నమ్ముకొరు. కానీ ఈ చిత్రంలో రాజమౌళి డైలాగ్ లకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.