రాఘవేంద్ర రావు “ఇంటింటా అన్నమయ్య” చిత్ర రికార్డింగ్ మొదలు పెట్టిన కీరవాణి

రాఘవేంద్ర రావు “ఇంటింటా అన్నమయ్య” చిత్ర రికార్డింగ్ మొదలు పెట్టిన కీరవాణి

Published on Oct 1, 2012 10:41 PM IST


కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రానున్న భక్తి రస చిత్రం “ఇంటింటా అన్నమయ్య” చిత్రం కోసం ఎం ఎం కీరవాణి పాటల రికార్డింగ్ మొదలు పెట్టారు.ఈ కార్యక్రమానికి బాలకృష్ణ,నయనతార మరియు రమేష్ ప్రసాద్ హాజరయ్యారు. యలమంచలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంతో యలమంచలి సాయిబాబు తనయుడు రేవంత్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవ్వనున్నాడు. అనన్య మరియు సనమ్ శెట్టి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. “రికార్డింగ్ ని ఒక్క సిట్టింగ్ లోనే పూర్తి చేస్తాము ఈ చిత్రం దసరాకి మొదలవుతుంది నవంబర్ 1 నుండి నవంబర్ 20 వరకు ఈ చిత్రం అరకులో చిత్రీకరణ జరుపుకుంటుంది. డిసెంబర్ 1న మరో షెడ్యూల్ మొదలవుతుంది ఆ షెడ్యూల్ లోనే చిత్రాన్ని పూర్తి చేస్తాము” అని నిర్మాత అన్నారు. ఈ చిత్రం సంగీతం మీద ఆధారపడిన చిత్రంగా ఉండబోతుంది.

తాజా వార్తలు