ఐపీఎల్ 2025 చివరి అంకానికి చేరుకుంటోంది. ఈ సీజన్ తొలి ప్లే ఆఫ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), పంజాబ్ కింగ్స్(PBKS) ఫైనల్ పోరులో తొలి ఎంట్రీ కోసం పోటీ పడ్డాయి. ఈ తొలి ప్లే ఆఫ్ మ్యాచ్లో టాస్ గెలిచిన RCB తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్కు వచ్చిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఏ ఒక్కరు కూడా నిలకడగా రాణించలేకపోయారు. దీంతో కేవలం 14.1 ఓవర్లకే 101 పరుగులు మాత్రమే చేసిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆలౌట్ అయ్యారు.
ఇక 102 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు వచ్చిన బెంగళూరు ముందు నుంచి దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్స్లో విరాట్ కోహ్లీ(12) త్వరగా ఔట్ అయినప్పటికీ మరో బ్యాటర్ ఫిల్ సాల్ట్(56 నాటౌట్) మ్యాచ్ను ఒంటిచేత్తో గెలిపించాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ పరుగుల వర్షం కురిపించాడు సాల్ట్. దీంతో కేవలం 10 ఓవర్లలోనే బెంగళూరు 2 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇక IPL 2025 ఫైనల్స్కు అఫీషియల్గా చేరుకున్న తొలి టీమ్గా RCB నిలిచింది.