టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి ‘మహా సముద్రం’ అనే సినిమా చేస్తోనట్లు రీసెంట్ గా అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. శర్వానంద్ తన కెరీర్ లో గమ్యం, ప్రస్థానం తరువాత మళ్ళీ అలాంటి బలమైన పాత్రను ఈ సినిమాలోనే చేస్తున్నాడని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కాగా తాజాగా ఈ సినిమాలో శర్వానంద్ కి జతగా ఐశ్వర్య రాజేష్ నటించబోతుందట. అజయ్ ఇప్పటికే ఐశ్వర్య రాజేష్ కి కథ కూడా వివరించారట. ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమా చేయడానికి బాగా ఆసక్తిగా ఉందట. ఒక విధంగా ఐశ్వర్య రాజేష్ కి ఇది మంచి అవకాశమే.
కాగా సినిమాలో హీరోయిన్ పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. ఇక కరోనా హడావుడి ముగిసాక ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నారు. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం సినిమా తెరకెక్కనుంది. అలాగే ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది.