కరోనా తగ్గాక.. చండీగఢ్ లోనే షూట్ చేస్తారట !

కరోనా తగ్గాక.. చండీగఢ్ లోనే షూట్ చేస్తారట !

Published on Apr 18, 2020 2:00 AM IST

నేచురల్ స్టార్ నాని నటించిన క్లాస్ మూవీ ‘జెర్సీ’ హిందీలో కూడా భారీ స్థాయిలోనే రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్‌ కనిపించనుంది. ఇప్పటికే చాల భాగం రెగ్యులర్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇక క్లైమాక్స్ అండ్ కొన్ని కీలక సన్నివేశాల షూట్ ను మాత్రమే మిగిలి ఉంది. చండీగఢ్ లో షూట్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా ఎఫెక్ట్ కారణంగా షూట్ పోస్ట్ ఫోన్ అయింది. కరోనా ప్రభావం తగ్గాక చండీగఢ్ లోనే చిత్రబృందం షూట్ ప్లాన్ చేస్తోందట. అన్నట్టు చండీగఢ్ లోని లొకేషన్స్ సినిమాలోని సీన్స్ కి బాగా సూట్ అవుతాయని.. ముఖ్యంగా లవ్ స్టోరీకి సంబంధించిన సీన్స్ అన్ని అక్కడే షూట్ చేయాలని చూస్తున్నారు.

ఇక ఇప్పటికే షాహిద్ క్రికెటర్ పాత్ర కోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. షాహిద్ కపూర్ ఇంతకుముందే తెలుగు చిత్రం ‘అర్జున్ రెడ్డి’ని హిందీలోకి ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి భారీ హిట్ అందుకొన్నారు. ఇప్పుడు కూడా అదే రీమేక్ ఫార్ములాను ఫాలో అవుతూ చేస్తున్న ఈ సినిమా మీద హిందీ ప్రేక్షకుల్లో కూడా అమితాశక్తి నెలకొని ఉంది. మరి ఈ సారి షాహిద్ కి ఈ రీమేక్ ప్లాన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తోందో చూడాలి. తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 28వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా డేట్ మారే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు