లక్ష్మి మంచు నిర్మాణంలో రాబోతున్న చిత్రం “గుండెల్లో గోదారి” చిత్రం దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. సినిమా డబ్బై శాతంకి పైగా చిత్రీకరణ పూర్తయ్యింది ఇంకొక రెండు నెలలలో మిగిలిన చిత్రీకరణ కూడా పూర్తి చేస్తారు. ఆది,లక్ష్మి మంచు,తప్సీ మరియు సందీప్ కిషన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.చిత్రంలో చాలా వరకు పాలకొల్లు,అమలాపురం మరియు గోదారి జిల్లాల పరిసరాలలో తెరకెక్కించారు. నాగేంద్ర కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది. 1986 జరిగిన వరదల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది,చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు, గుండెల్లో గోదారి జూన్ లో విడుదల కానుంది