డైరెక్ట్ స్ట్రీమింగ్ కు రానున్న గోపీచంద్ సినిమా.!

డైరెక్ట్ స్ట్రీమింగ్ కు రానున్న గోపీచంద్ సినిమా.!

Published on Jun 20, 2020 3:02 AM IST


లాక్ డౌన్ విధించడం మూలాన అన్ని సినీ ఇండస్ట్రీలకు ఏ స్థాయిలో నష్టాలు వాటిల్లాయో అందరికీ తెలిసిందే. అలాగే ఇదే లాక్ డౌన్ మూలాన పలు చిత్రాలకు నేరుగా డిజిటల్ గా విడుదలైందుకు ఆస్కారం దొరికింది.

దీనితో ఎప్పుడో కొన్ని కారణాలు చేత షూటింగ్ అయ్యి ఆగిపోయిన చిత్రాలు నుంచి లేటెస్ట్ గా తీసిన చిత్రాలు వరకు నిర్మాతల నిర్ణయం మేరకు ఓటిటి సంస్థలు కొనుగోలు చేసి నేరుగా డిజిటల్ గానే విడుదల చేసేస్తున్నారు.

అలా ఇప్పుడు టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా ఒకప్పటి సెన్సేషనల్ దర్శకుడు బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఆరడుగుల బుల్లెట్”. ఎప్పుడో 2017 లో విడుదల కావాల్సిన ఈ చిత్రం చివరి నిమిషంలో ఆగిపోవాల్సి వచ్చింది.

కానీ ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్ గా ఓటిటిలో విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు అంగీకరించినట్టు సమాచారం. ఓ ప్రముఖ ఓటిటి సంస్థ ఈ చిత్రాన్ని కొనుగోలు చేయగా ఈ చిత్రం ఓటిటిలో విడుదల కానుంది. ఈ చిత్రంలో గోపిచంద్ సరసన నయనతార హీరోయిన్ గా నటించగా మణిశర్మ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు