మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పన్ కోషియమ్’ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తెలుగులో రీమేక్ చేయబోతోందని.. ఈ సినిమాలో బాలయ్య బాబు అండ్ రానా కలిసి నటించబోతున్నారని ఇటివలే వార్తలు వచ్చాయి. కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ రీమేక్ పై బాలకృష్ణ ఆసక్తి చూపించలేదట. అందుకే బాలయ్య ప్లేస్ లో వెంకటేష్ ను తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తునట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ రీమేక్ లో నటించడానికి వెంకీ – రానా ఇంట్రస్ట్ గా ఉన్నారట. ఒరిజినల్ వర్షన్ లో పోలీస్ క్యారెక్టర్ చేసిన బిజూ మీనన్ పాత్రలో తెలుగులో వెంకీ చేయబోతున్నాడట. అలాగే మరో హీరో పాత్రలో రానా నటిస్తాడు. అయితే, ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకపోయినప్పటికీ ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులన నిర్మాత సూర్య దేవర నాగవంశీ సొంతం చేసుకున్నారు. నాగవంశీ మొదట ఈ సినిమాని బాలయ్య – మంచు విష్ణు కలయికలో తీద్దామనుకున్నారట. ఫైనల్ గా వెంకీ – రానా కాంబినేషన్ లో రాబోతుంది. అయితే ఇంతవరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.