టాలీవుడ్ లో నటించిన కొద్ది సినిమాలతో బాగా గుర్తింపు తెచ్చుకుంది, హీరోయిన్ సాయి పల్లవి. ఆమె నటించిన చిత్రాలలో ఫిదా ఆమెకు భారీ ఇమేజ్ తెచ్చిపెట్టింది. తెలంగాణా పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి నటనను ఎవరూ మరచిపోలేరు. ఆ మూవీలోని ‘వచ్చిండే…’పాటకు ఆమె వేసిన స్టెప్స్ యూత్ ని ఊపేశాయి. కాగా మరో చిత్రంలో సాయి పల్లవి ఈ తరహా పాత్రలో మెప్పించనుందని వార్తలు వస్తున్నాయి
నాని హీరోగా యువ దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ ఓ మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్యామ్ సింగరాయ్ పేరుతో తెరకెక్కనున్న ఆ చిత్రంలో హీరోయిన్ గా సాయి పల్లవి ఎంపికైంది. కథ రీత్యా సాయి పల్లవి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుందట. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తుంది. రానాతో చేస్తున్న విరాటపర్వం మూవీలో కూడా సాయి పల్లవి పల్లెటూరి అమ్మాయి పాత్ర చేస్తుంది.