ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా (డ్రాగన్) పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుత షెడ్యూల్లో తారక్ లేని సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. వచ్చే వారం నుంచి ఎన్టీఆర్ ఈ చిత్ర సెట్స్లోకి అడుగు పెడతారని తెలుస్తోంది. ఎన్టీఆర్ పై యాక్షన్ సీన్స్ ను తీస్తారని తెలుస్తోంది. అనంతరం ఎన్టీఆర్ పై సోలో సాంగ్ ను షూట్ చేస్తారట. ఆ సాంగ్ కోసం ప్రత్యేకంగా సెట్స్ కూడా వేస్తున్నారట. కాగా ఈ పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్కు జోడీగా రుక్మిణీ వసంత్ కనిపించబోతుంది.
కాగా మలయాళ యువ హీరో టొవినో థామస్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆ మధ్య ఈ సినిమా గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ‘ఆడియన్స్ ఊహించని స్థాయిలో ఈ మూవీని తీస్తున్నాను. ఎన్టీఆర్ పై అభిమానంతో ఈ సినిమా చేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.