టాలీవుడ్ స్టార్స్ తో పాటు ఇతర సినీ ఇండస్ట్రీలోని స్టార్స్ కూడా ప్రతి సమ్మర్ కి ఎవరికీ వాళ్ళు తమ కుటుంబాలతో కలిసి విదేశాలకు ట్రిప్ వేస్తుంటారు. ముఖ్యంగా ప్రతి వేసవికి మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య, రామ్, ప్రభాస్, అఖిల్ లాంటి హీరోలు తమ కుటుంబాలతో కలిసి విదేశాలకు వెళ్తారు. కానీ కరోనా వల్ల వేసవి మొత్తం వాళ్ళంతా ఇంట్లోనే గడిపేస్తున్నారు.
అనేక దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో ఆయా దేశాలు ఇప్పట్లో టూరిస్ట్ వీసాలకు అనుమతులు ఇచ్చే అవకాశమే లేదు. దీంతో ఈ ఏడాది మొత్త్తం మన స్టార్స్ ఎలాంటి
వెకేషన్ ప్లాన్ చేసుకోవటానికి వీలు లేకుండా పోయింది. ఇప్పటికే చాలామంది స్టార్స్ రిస్క్ తీసుకోవడం ఎందుకని అసలు ఇంట్లో నుండి బయటకే రావడం లేదు. మొత్తానికి కరోనా స్టార్స్ లైఫ్ స్టైల్ ను మార్చింది.