థియేటర్ యాజమాన్యాలలో గుబులు..!

థియేటర్ యాజమాన్యాలలో గుబులు..!

Published on May 17, 2020 10:52 AM IST

టాలీవుడ్ లో 2020 చాలా గొప్పగా స్టార్ట్ అయ్యింది. ఆ ఉత్సహం చూసి ఈ ఏడాది టాలీవుడ్ కి మంచి రోజులే అనుకున్నారు, కానీ కరోనా వలన టాలీవుడ్ చరిత్రలో మర్చిపోలేని ఏడాదిగా 2020 నిలిచింది. సినిమా మార్కెట్ మొత్తం దెబ్బతింది. ముఖ్యంగా థియేటర్స్ పరిస్థితి మరింత దారుణంగా తయారు అయ్యింది. ఇప్పటికే ఓ టి టి దెబ్బతో అల్లాడిపోతున్న దియెటర్లు కరోనా దెబ్బకి డమ్మీలుగా మిగిలిపోయాయి. ఇక ఓ టి టి లు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సినిమాలను డైరెక్ట్ గా రిలీజ్ చేసుకుంటున్నాయి. వాటిని ఆపటం థియేటర్స్ యాజమాన్యాల వల్ల కావటం లేదు. దీనికి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా తిరిగి థియేటర్స్ ఓపెన్ చేయటమే మార్గం.

ఆ దిశగా తెలుగు రెండు రాష్ట్రలో చర్చలు మొదలైనట్లు తెలుస్తుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అనేకం వున్నాయి, వాటికైనా స్పెషల్ పర్మిషన్స్ ఇచ్చి ఓపెన్ చేయాలనీ ప్రభుత్వం వద్దకు తమ వినతిని తీసుకోని వెళ్లినట్లు తెలుస్తుంది. అలాగే మల్టిఫ్లెక్స్ లు కూడా పెద్ద స్థాయిలోనే లాబీయింగ్ చేసి తమ మాల్స్ ని తిరిగి ఓపెన్ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అవన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ చివరి నాటికీ అన్ని సినిమా హాల్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎంత మంది కరోనా భయం దాటుకొని సినిమా చూడటానికి థియేటర్స్ కి వస్తారనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు