మెగాస్టార్ నుండి ఇంట్రస్టింగ్ ఫోటో !

లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానుల కోసం అద్భుతమైన వీడియోలను ఫోటోలను పోస్ట్ చేస్తూ తనదైన శైలిలో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.

కాగా తాజాగా ఈ రోజు, ఆయన పోస్ట్ చేసిన ఒక ఫోటో బాగా ఆసక్తిని కలిగిస్తోంది. 1990లో వెకేషన్ కోసం తన సతీమణితో యూఎస్ వెళ్లినప్పుడు అక్కడ సరదాగా కలిసి వంట చేస్తున్న సందర్భంగా తీసిన అరుదైన పాత ఫోటోను మెగాస్టార్ పోస్ట్ చేసారు.

విశేషమేమిటంటే, చిరు ఆ ఫోటో కింద లాక్ డౌన్ లో దిగిన సేమ్ అలాంటి ఫోటోనే పోస్ట్ చేస్తూ.. ‘తాను..నేను. కాలం మారినా…దేశం మారినా…’ అని ఇంట్రస్టింగ్ మెసేజ్ తో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.

 

Exit mobile version