మెగాస్టార్ చిరంజీవి తన తల్లిగారైన అంజనా దేవి గురించి ప్రచురించిన ఓ వార్తపై ఆయన స్పందించారు. ఆ కథనంలో పొందుపరచిన ఫోటోలో ఉన్న మహిళ తన తల్లికాదని చెప్పారు. కరోనాపై పోరులో చిరంజీవి తల్లి అంజనాదేవి భాగమయ్యారని, ఆమె గత 3 రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి 700 మాస్క్లు కుట్టి అవసరమైన వారికి అందజేస్తున్నారని ఓ పేపర్లోనే కాకుండా పలు ఛానళ్లలో ప్రసారం చేయడం జరిగింది.
అయితే దీనిపై స్పందించిన చిరంజీవి..”మా అమ్మగారు మాస్క్లు తయారుచేస్తున్నారనే వార్తలు కొన్ని మీడియా సంస్థలు ప్రచురించడం చూశాను. ఆ మీడియా కథనంలో ఉన్నది మా అమ్మగారు కాదని వినయంగా తెలియజేస్తున్నాను. కానీ ఎవరైతే ఈ కథనంలో ఉన్నారో ఆ తల్లికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే..” అని చిరంజీవి తన ట్వీట్లో తెలిపారు.
It is reported in press & some media channels that my mother is doing this humanitarian work. I humbly seek to clarify that it is not my mother but whichever mother is engaged in this great act of compassion I heartily thank her for such kindness.కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే pic.twitter.com/svN4RduRUg
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 11, 2020