గత కొన్ని రోజుల క్రితమే బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య చేసుకున్న ఘటన మొత్తం అన్ని ఇండస్ట్రీ లలో ఒక విషాద ఘట్టంగా మిగిలిపోయింది. దీనితో సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ లోని కొంతమంది పెద్దలే కారణం అని అనేక కోణాలు వినిపించాయి.
అయితే అలాంటి తరహా మాఫియా ఒక్క నటులకు మాత్రమే కాదు సింగర్స్ మరియు ఇతర ఆర్టిస్టులకు కూడా ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నారని బాలీవుడ్ సీనియర్ స్టార్ సింగర్ సోను నిగమ్ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. బాలీవుడ్ లో రెండు టాప్ మ్యూజిక్ సంస్థలే గాయకుల భవిష్యత్తును నిర్ణయిస్తున్నారని షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు.
అలాగే అక్కడ పాటల రచయితలకు మరియు సింగర్స్ కు కూడా డబ్బులు ఇవ్వరని ఎవరైతే ఎప్పుడూ న్యూస్ లో ఉంటారో వారికే అన్ని దక్కుతాయని కామెంట్ చేసారు. అంతే కాకుండా బాలీవుడ్ లో ఇదే సంప్రదాయం ఇంకా కొనసాగితే రాబోయే రోజుల్లో సంగీత ఇండస్ట్రీ నుంచి కూడా ఆత్మ హత్యలు చేసుకున్నా ఆశ్చర్యం లేదని షాకింగ్ కామెంట్స్ చేసారు.