బాలీవుడ్ కి పాకిన బన్నీ మేనియా

అల వైకుంఠపురంలో ఏ స్థాయి విజయం సాధించిందో అందరికీ తెలుసిందే. నాన్ బాహుబలి రికార్డులు ఈ చిత్రం సొంతం చేసుకుంది. బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ చిత్రం వసూళ్ల వరదపారించింది. బన్నీ సరసన పూజా హెగ్డే నటించగా.. టబు, నివేదా పేతురాజ్, సుశాంత్, జయ రామ్, మురళి శర్మ ఇతర కీలకపాత్రలు పోషించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

కాగా అల వైకుంఠపురంలో మేనియా బాలీవుడ్ కి పాకింది. ఈ చిత్ర విజయంలో థమన్ అందించిన సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ఈ మూవీ సాంగ్స్ సందడి చేశాయి. అలాగే ఈ పాటలకు బన్నీ స్టెప్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా రాములో.. రాములా సాంగ్ లో ఆయన వేసిన దోశ స్టెప్ భలే పాప్యులర్ అయ్యింది. కాగా ఈ పాటకు ఆ దోశ స్టెప్ వేసి అలరించారు బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ శిల్పా శెట్టి. ఇప్పుడు ఆమె వేసిన బన్నీ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనితో బన్నీ మేనియా బాలీవుడ్ కి పాకిందని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

Exit mobile version