‘శిరిడి సాయి’ నిర్మాత మహేష్ రెడ్డి కోటి విరాళం !

‘శిరిడి సాయి’ నిర్మాత మహేష్ రెడ్డి కోటి విరాళం !

Published on Apr 17, 2020 5:21 PM IST


కరోనా మహమ్మారి పై పోరాటంలో భాగంగా తమ వంతు సాయం అందించడానికి పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖలు ముందుకొస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సంక్షోభ సమయంలో కరోనా వైరస్ బాధితుల సహాయార్థం కొరకు ఓం నమో వేంకటేశాయ ఫిల్మ్స్ అధినేత, ‘శిరిడి సాయి’ సినిమా నిర్మాత మరియు ఏఎమ్ఆర్ గ్రూప్ చైర్మన్ ‘మహేష్ రెడ్డి’ తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. కోటి రూపాయిలను విరాళంగా ఇచ్చారు.

ఇప్పటికే తెలంగాణకు ప్రకటించిన ఫండ్ ను కేటీఆర్ ను కలిసి చెక్ రూపంలో అందజేశారు. కాగా క‌రోనా వ్యాప్తి నిరోధం విష‌యంలో రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తున్నాయి. ప్ర‌భుత్వాల స‌ల‌హాలు, సూచ‌న‌లు ప్ర‌జ‌లంద‌రూ తూ.చ‌. త‌ప్ప‌కుండా పాటించాల‌ని మహేష్ రెడ్డి కోరుతున్నారు. ఇక ప్రజలు కూడా ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిని స‌మ‌ష్టిగా ఎదుర్కోవాలి, అంద‌రూ ఇళ్ల‌ల్లోనే సుర‌క్షితంగా ఉండాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు