అల్లు అర్జున్, శృతిహాసన్ ల రేస్ గుర్రం సినిమాపై అంచానాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. యాక్షన్ డ్రామా నేపధ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో సలోని, రవి కిషన్ ముఖ్య పాత్రలు పోషించారు. నల్లమలపు బుజ్జి, వెంకటేశ్వర రావు నిర్మాతలు. మనొజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్
ఈ సినిమా సంగీతం ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ పాటల ప్రోమో వీడియోలకు మంచి స్పందన వస్తుంది. ఇప్పుడు అందరి కళ్ళూ ట్రైలర్ మీద పడ్డాయి. ముందుగా ఈ సినిమా ఆడియో విడుదల వేడుకలో ట్రైలర్ ని విడుదలచేద్దాం అనుకున్నా కొన్నితుదిమెరుగుల కోసం వాయిదా వేసారు. రేపు రాజమండ్రి లో ఒక కాలేజి వేడుకలో ఈ ట్రైలర్ ని విడుదల చేసి ఆ తరువాత మీడియా కి పంపుతారని సమాచారం
థమన్ సంగీత దర్శకుడు. త్వరలో ఈ సినిమా మనముందుకు రానుంది