జూలై 5న థియేటర్లలో ‘లోపలికి రా చెప్తా’ గ్రాండ్ రిలీజ్

జూలై 5న థియేటర్లలో ‘లోపలికి రా చెప్తా’ గ్రాండ్ రిలీజ్

Published on Jun 15, 2025 8:00 AM IST

మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం ‘లోపలికి రా చెప్తా’. కొండా వెంకట రాజేంద్ర ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా స్వయంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పాటలు, పోస్టర్లు ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందాయి. ఈ నేపథ్యంలో, చిత్ర మేకర్స్ జూలై 5న ‘లోపలికి రా చెప్తా’ను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

చిత్ర దర్శకుడు వెంకట రాజేంద్ర మాట్లాడుతూ, “మా హీరో క్యారెక్టర్ డెలివరీ బాయ్. అందుకే మొదటి పాటను కూడా డెలివరీ బాయ్‌తో విడుదల చేశాం. ఆ పాటకు మంచి స్పందన వచ్చింది. త్వరలో ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నాం. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూలై 5న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకెళ్తున్నాం.
ప్రతిష్టాత్మకమైన సరిగమ ఆడియో కంపెనీ ఈ చిత్ర ఆడియో హక్కులు పొందింది. అవుట్‌పుట్ చూసి టీమ్ చాలా సంతోషంగా ఉంది. ‘లోపలికి రా చెప్తా’ ప్రేక్షకులను తప్పకుండా మెప్పించే సినిమా అవుతుంది. సహకరించిన అందరికీ ధన్యవాదాలు. త్వరలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కలుసుకుందాం” అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు