తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ దిశగా సూర్య ‘రెట్రో’ !

తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ దిశగా సూర్య ‘రెట్రో’ !

Published on May 4, 2025 10:02 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన సినిమా “రెట్రో”. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేకపోతుంది. దీనికి తోడు, సినిమా పై విపరీతంగా ట్రోల్స్‌ క్రియేట్‌ చేస్తోన్నారు ట్రోలర్స్. నిజానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ఈ చిత్రం టాలీవుడ్ లో పెద్దగా ప్రభావం చూపలేదు. 3వ రోజు నైజాంలో రూ. 17 లక్షల షే ను మాత్రమే వసూలు చేసింది, ఇతర చోట్ల కూడా చాలా తక్కువ స్థాయిలోనే కలెక్షన్స్ ను సాధించింది. ఈ రోజు ఆదివారం కాబట్టి, మరి ఈ రోజు అయినా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వస్తాయేమో చూడాలి.

మొత్తానికి ఇప్పుడున్న అప్ డేట్ ప్రకారం ఈ చిత్రం సోమవారం నాటికి బాక్సాఫీస్ వద్ద తన ప్రస్థానం ముగిస్తోందని టాక్. మొత్తానికి సూర్య కెరీర్లో ఇది మరో డిజాస్టర్ అన్నట్టు తమిళ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక డే 4 నుంచి వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి మరి. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా సూర్య, జ్యోతికలు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు