టాలీవుడ్లో ఎవర్గ్రీన్ క్లాసిక్ చిత్రంగా నిలిచిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేయగా మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్పై సి.అశ్వినీదత్ ప్రొడ్యూస్ చేశారు.
ఇక ఇప్పుడు ఈ సినిమా రీ-రిలీజ్కు రెడీ అవుతోంది. ప్రస్తుతం రీ-రిలీజ్ చిత్రాల ట్రెండ్ నడుస్తుండటంతో ఇలాంటి క్లాసిక్ చిత్రాలను నేటి తరం ప్రేక్షకులకు వెండితెరపై చూడాలని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో ఈ సినిమాను మే 9న గ్రాండ్ రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాను 2D మరియు 3Dలో రీ-రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర మేకర్స్ వెల్లడించారు.
ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించగా ఇందులోని పాటల శ్రోతలను నేటికీ అలరిస్తున్నాయి. మరి ఈ క్లాసిక్ చిత్రం రీ-రిలీజ్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.