పిక్ టాక్ : మాస్ & స్టైలిష్ లుక్‌ లో ఎన్టీఆర్ !

పిక్ టాక్ : మాస్ & స్టైలిష్ లుక్‌ లో ఎన్టీఆర్ !

Published on Mar 17, 2025 1:58 PM IST

‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ‘వార్-2’ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ మరోసారి ముంబై వెళ్లారు. అక్కడి ఎయిర్ పోర్ట్‌లో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బ్లాక్ జీన్స్‌ వేసుకొని బ్లాక్ అద్దాలు ధరించిన యంగ్ టైగర్ మాస్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ‘వార్-2’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎన్టీఆర్ తన పాత్రకు హిందీ వెర్షన్ డబ్బింగ్ చెప్పడానికి ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కాంబినేషన్ అంటే.. బాక్సాఫీస్ షేక్ అయినట్టే.

కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2′ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్నట్టు ఈ చిత్ర నిర్మాణ సంస్థ నిన్న ఈ చిత్రం రిలీజ్ పై స్పందిస్తూ.. ‘‘మేము ‘వార్‌ 2’ మార్కెటింగ్‌ ప్రారంభించక ముందే మీరు(ఫ్యాన్స్) అద్భుతంగా ప్రమోషన్లు మొదలు పెట్టారు. 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో అల్లకల్లోలం జరుగుతుంది’ అని విడుదల తేదీపై తొలిసారి నిర్మాణ సంస్థ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు