బ్యాడ్ లక్.. ఈ ముగ్గురు భామలకు కలిసిరాని రీ-ఎంట్రీ!

టాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారు. అయితే, కొందరికీ రీ-ఎంట్రీలో సాలిడ్ హిట్ పడుతుంది. కానీ, మరికొందరికీ ఈ రీ-ఎంట్రీ కలిసిరాలేదు. ఇటీవల టాలీవుడ్‌లో ముగ్గురు హీరోయిన్లు రీ-ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఏ ఒక్కరికీ కూడా సాలిడ్ కమ్ బ్యాక్ మాత్రం రాలేదు.

మన్మధుడు, రాఘవేంద్ర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన అన్షు ఇటీవల ‘మజాకా’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. కానీ, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. ఇక నితిన్ హీరోగా తెరకెక్కిన ‘తమ్ముడు’ సినిమాతో నటి లయ కూడా తన రీ-ఎంట్రీపై భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ, ఈ సినిమా కూడా డిజాస్టర్‌గా మిగిలింది. మరో హీరోయిన్ జెనీలియా ‘జూనియర్’ చిత్రంతో టాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఆమెకు ఈ సినిమాతో అనుకున్న గుర్తింపు అయితే రాలేదు.

మొత్తానికి ముగ్గురు హీరోయిన్లు రీ-ఎంట్రీతో మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూసినా, వారికి బ్యాడ్ లక్ ఎదురైంది. మరి ఈ భామలు మున్ముందు మరిన్ని సినిమాలు చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.

Exit mobile version