అయితే టీడీపీ పార్టీలో అండగా ఉంటూ 2009లో జరిగిన ఎన్నికల్లో పార్టీకి సపోర్ట్ ఇస్తూ ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు పాదయాత్రలో అస్వతతకి గురయ్యారని తెల్సుకుని ఈ రోజు జరగవలిసిన ‘బాద్షా’ షూటింగ్ నిలిపివేసి హుటాహుటిన గద్వాల్ బయలుదేరారు. ఎన్టీఆర్ తో పాటుగా బాద్షా చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల మరియు నిర్మాత బండ్ల గణేష్ కూడా ఆయనతో పాటుగా గద్వాల వెళ్లారు. చంద్రబాబు, ఎన్టీఆర్ మధ్య మనస్పర్ధలు ఉన్నట్లు ఈ మద్య వస్తున్న పుకార్లకు ఈ సంఘటనతో సమాధానం ఇచ్చినట్లైంది. చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకుని తిరిగి పాదయాత్ర ప్రారంభించాలని కోరుకుందాం.