బాలీవుడ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సంఘటన జరిగి నెలలు గడుస్తున్నా.. దేశ వ్యాప్తంగా ఇంకా ఈ కేసు సంచ లనంగానే ట్రెండ్ అవుతోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక హీరో.. ఇలా అర్ధంతరంగా చనిపోవడం సినీ ప్రేముకుల మనసులను తీవ్రంగా కలిచివేసింది. దానికి తోడు సుషాంత్ మరణం పై రోజురోజుకూ అనేక ఆరోపణలు తెరపైకి వస్తుండటం.. అందుకు తగ్గట్టుగా ఈ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించడంతో సుశాంత్ అభిమానులతో పాటు యావత్తు సినీ జనాలు కూడా అసలు ఏం జరిగిందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే, విచారణ జరిపే కొద్దీ కేసు మరింత జఠిలమైవుతుంది. సీబీఐ వేగంగా దర్యాప్తు చేస్తోన్నా.. నిజానిజాలు ఏమిటనేది ఇంకా స్పష్టత రాని పరిస్థితి. మరోపక్క అధికారులు సుషాంత్ నివాసంలో మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. అయితే సుషాంత్ పై విష ప్రయోగం జరిగిందని.. ఆ వాస్తవాలు బయటకు రాకుండా కొందరు కుట్ర పన్నారని సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణ నిజమా అబద్దమా అనే విషయం పక్కన పెడితే.. సుశాంత్ పోస్ట్ మార్టం విషయంలో కావాలనే ఆలస్యం చేశారని ఇప్పటికే రుజువు అయింది. సుశాంత్ చావుకు బాధ్యులైన వారందర్నీ కఠినంగా శిక్షించాలి.