‘కన్నప్ప’ పైరసీపై విష్ణు కామెంట్.. ఆపాల్సిందే!

‘కన్నప్ప’ పైరసీపై విష్ణు కామెంట్.. ఆపాల్సిందే!

Published on Jun 30, 2025 12:10 PM IST


టాలీవుడ్ హీరో విష్ణు మంచు నటించిన లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’ ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయగా డా. ఎం.మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

అయితే, ఈ తరుణంలో ఈ చిత్రం పైరసీ బారిన పడింది. దీనిపై తాజాగా విష్ణు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘కన్నప్ప’ భారీ పైరసీకి గురైందని.. అప్పటికే 30 వేలకు పైగా పైరసీ లింక్‌లను డిలీట్ చేశామని.. అయినా కూడా ఈ చిత్ర పైరసీ ఆగడం లేదని.. పైరసీలో సినిమా చూడటం అంటే దొంగతనం చేయడంతో సమానం అని ఆయన పేర్కొన్నారు. మనం మన పిల్లలకు దొంగతనం చేయడం నేర్పించము.. అందుకే వారిని పైరసీలో సినిమాను చూడటం ఎంకరేజ్ చేయకూడదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ఇక ‘కన్నప్ప’ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, కాజల్, ప్రియా ముకుందన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు