తమిళ హీరో విజయ్ ఆంటోని నటించే సినిమాలకు తెలుగులోనూ మంచి బజ్ ఏర్పడుతుంది. ఆయన నటించిన ‘బిచ్చగాడు’ తెలుగునాట కలెక్షన్ల మోత మోగించింది. ఇక ఆ తర్వాత చాలా సినిమాలు తీసినా పెద్దగా వర్కవుట్ కాలేదు. అయితే, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ చిత్రంతో విజయ్ ఆంటోని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
‘మార్గన్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో విజయ్ ఆంటోని ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా రూపొందించారు. ఇక ఈ సినిమాకు విజయ్ ఆంటోని సంగీతం కూడా అందిస్తున్నాడు.
ఈ సినిమాను లియో జాన్ పాల్ డైరెక్ట్ చేయగా అజయ్ దిషాన్, సముద్రఖని, బ్రిగిడా, దీప్షికా, మహానటి శంకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫాతిమా విజయ్ ఆంటోని ప్రొడ్యూస్ చేస్తుండగా జూన్ 27న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.