చివరగా “కాస్కో” చిత్రం లో కనిపించిన వైభవ్ తమిళం లో బాగా నటిస్తున్నారు. యేసన్ మరియు “మంకాత” చిత్రం లో ప్రధాన పాత్రలు పోషించిన ఈ నటుడు ప్రస్తుతం ఒక ద్విభాషా చిత్రాన్ని ఒప్పుకున్నారు. అల్ఫాన్స్ దర్శకత్వం వస్తున్న ఈ చిత్రాన్ని చినబాబు మరియు రాజా బాలాజీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళ నటి అర్చనా కవి కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ మధ్యనే అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమయ్యింది ఫిబ్రవరి 10 నుండి రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకోనుంది చిత్రం లో చాలా వరకు రామోజీ ఫిలిం సిటీ మరియు కేరళ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. 24 గంటలలో ఒక వ్యక్తికి ఎదురయిన సంఘటనలే కథా నేఫధ్యంగా రూపొందుతున్న చిత్రం.