లాక్ డౌన్ సమయంలో సినీ కార్మికులను ఆదుకోవడానికి చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేయగా, టాలీవుడ్ లోని ప్రముఖ హీరోలు, దర్శక నిర్మాతలు విరాళాలు అందించడం జరిగింది. అలాగే కొందరు కరోనా పై యుద్ధంలో విశేష సేవలు అందిస్తున్న పోలీస్ మరియు వైద్య సిబ్బంది కావలసిన మాస్కులు, శానిటైజర్స్ అందించారు.
ఈ కష్ట కాలంలో ప్రతి విషయంలో ముందుండి తమకు తోచిన సాయం చేస్తున్నారు సినీ ప్రముఖులు. తాజాగా హీరో రానా దగ్గుబాటి, లక్ష్మీ మంచు, నవదీప్, అల్లు శిరీష్ ఈ సేవలో భాగం పంచుకున్నారు. వీరు జి హెచ్ ఎమ్ సి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం పేస్ షీల్డ్స్ డొనేట్ చేసి తమ సామాజిక బాధ్యత నెరవేర్చారు.