తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘కూలీ’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
అయితే, రిలీజ్కు దగ్గరవుతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో రజినీ ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఈ సినిమాలో ఎంత వయొలెన్స్ ఉంటే సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇస్తుందని వారు చర్చించుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే, కూలీ చిత్రంలో కూడా బ్లడ్ బాత్ ఖాయమని వారు అంటున్నారు.
ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసేందుకు లోకేష్ అండ్ టీమ్ రెడీ అవుతుంది. ఈ చిత్ర ట్రైలర్ను ఆగస్టు 2న రిలీజ్ చేస్తుండగా ఈ చిత్రాన్ని ఆగస్టు 14న వరల్డ్వైడ్ గ్రాండ్ రిలీజ్కు సిద్ధమైంది. ఈ సినిమాలో ఉపేంద్ర, నాగార్జున, సత్యరాజ్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.