యంగ్ హీరో తేజా సజ్జ ‘హను-మాన్’ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనం చూశాం. ఇక ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తుండగా సూపర్ యోధా గా తేజా ఈ సినిమాలో కనిపిస్తాడు.
ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ వచ్చాయి. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మిరాయ్ టీజర్ను మే 28న ఉదయం 10.08 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ సినిమాలో మంచు మనోజ్ ఓ పవర్ఫుల్ విలన్గా కనిపిస్తాడు. ఈ సినిమాలోని ఆయన పాత్ర ప్రేక్షకులను స్టన్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.