ఏపీలో ‘కన్నప్ప’ టికెట్ రేట్లు పెంపు.. ఏకంగా పది రోజులు!

ఏపీలో ‘కన్నప్ప’ టికెట్ రేట్లు పెంపు.. ఏకంగా పది రోజులు!

Published on Jun 25, 2025 8:05 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ డివోషనల్ ఎపిక్ డ్రామా మూవీ ‘కన్నప్ప’ జూన్ 27న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయగా విష్ణు మంచు హీరోగా నటించాడు. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో దీనికోసం భారీగా బడ్జెట్‌ను కేటాయించారు నిర్మాత డా.ఎం.మోహన్ బాబు. ఇక అత్యంత భారీ అంచనాల నడుమ ఈ సినిమాను రిలీజ్ చేస్తుండగా, ఇప్పుడు ఈ చిత్ర మేకర్స్‌కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇచ్చింది.

ఈ చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రిలీజ్ రోజైన జూన్ 27 నుంచి పది రోజుల పాటు ఈ చిత్ర టికెట్ రేట్లు రూ.50 ప్లస్ జీఎస్టీ గా పెంపు ఉండనుంది. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ రెండింటికీ ఈ పెంపు వర్తిస్తుందని తాజాగా ఓ జీఓ జారీ అయ్యింది. దీంతో ఏపీలో కన్నప్ప టికెట్ రేట్లు మల్టీప్లెక్స్‌లో రూ.236/-, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.206.50 వరకు ఉండే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమాలో మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి స్టార్స్ యాక్ట్ చేశారు. ఈ సినిమా తొలిరోజు భారీ వసూళ్లు రాబట్టడం ఖాయమని సినీ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు