టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘కుబేర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లీడ్ రోల్స్లో నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. కాగా ఈ సినిమా కేరళ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ను మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్కు చెందిన ప్రొడక్షన్ హౌజ్ వేఫారర్ ఫిలింస్ దక్కించుకుంది. దీంతో ఈ సినిమాకు కేరళలో మరింత క్రేజ్ రావడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమా ట్రైలర్ను జూన్ 14న రిలీజ్ చేస్తుండటంతో ఈ మూవీపై నెలకొన్న హైప్ మరింత పెరగడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ 20న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.