‘ది రాజాసాబ్‌’ పార్ట్‌ 2 మారుతి క్లారిటీ !

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ‘ది రాజా సాబ్’ అనే భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీమ్‌ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ వండర్ ఫుల్ గా ఉంది. ఐతే, రాజాసాబ్‌ పార్ట్‌ 2 ఉంటుందా ? అని మారుతిని అడిగితే.. పార్ట్ 2 పై మారుతి క్లారిటీ ఇచ్చారు. మారుతి మాట్లాడుతూ.. ‘సినిమా పూర్తయ్యాక చూద్దాం. పార్ట్‌ 2 కోసం బలవంతంగా కథను సాగదీసి రుద్దను. కంగారుపడొద్దు. ఆ క్లారిటీ మాకు ఉంది’ అని మారుతి తెలిపారు.

మారుతి ఇంకా మాట్లాడుతూ.. ‘నటీనటులకు సుమారు 8 గంటల షిఫ్ట్‌ అనేది సాధారణంగా ఉంటుంది. కానీ, ఈ సినిమా కోసం మేము 18 గంటలు కూడా వర్క్ చేశాం. అందుకే ఇంత మంచి అవుట్‌పుట్‌ వచ్చింది’ అని మారుతి తెలిపారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టి.జి.విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version