నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘కుబేర’. దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ఈ నెల 20న రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ధనుష్ మాట్లాడారు. ఇంతకీ ధనుష్ ఏం మాట్లాడారు అంటే.. ‘ఈ ఈవెంట్ లో నా పై ప్రదర్శించిన నా ఏవీ చూడగానే నాన్న గుర్తొచ్చారు. ఆయన వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఈ సినిమా కోసం శేఖర్ సర్ చాలా కష్టపడ్డారు. ‘కుబేర’ తమిళ్లో నాకు 51వ సినిమా, తెలుగులో రెండో చిత్రం’ అని ధనుష్ మాట్లాడారు.
ధనుష్ ఇంకా మాట్లాడుతూ.. ‘నిజానికి ‘సార్’ మూవీ కంటే ముందే నాకు శేఖర్ ఈ కథ చెప్పారు. ఇందులో నటించే అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్. నాగార్జున సర్తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. రష్మిక కష్టపడి పని చేస్తుంది’ అని ధనుష్ చెప్పుకొచ్చాడు. అలాగే ధనుష్ గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘ధనుష్ పోషించని పాత్రంటూ లేదు. యాక్టింగే కాదు అన్ని విభాగాల్లో ఆయనకు పట్టుంది. ఫస్ట్ షాట్ తోనే ఆయన నటనకు ఇంప్రెస్ అయ్యా’’ అని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చాడు.